తెలంగాణలో కొత్తగా మూడు కేసులు
BY Telugu Gateway4 May 2020 3:18 PM GMT
X
Telugu Gateway4 May 2020 3:18 PM GMT
రాష్ట్రంలో ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసుల నమోదు ఇదే మొదటిసారి. సోమవారం నాడు కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1085కు పెరిగింది. సోమవారం నాడు 40 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 471. ఇప్పటివరకూ కోలుకుని ఇళ్ళకు వెళ్లిన వారి సంఖ్య 585.
రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం మరణాల సంఖ్య 29. కొత్తగా వెలుగుచూసిన మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు హెల్త్ బులెటిన్ గణాంకాలు చెబుతున్నాయి.
Next Story