నీ ఆస్తులు నువ్వే రక్షించుకోస్వామి..నాగబాబు ట్వీట్
BY Telugu Gateway24 May 2020 5:35 PM IST

X
Telugu Gateway24 May 2020 5:35 PM IST
తమిళనాడులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల అమ్మకంపై టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ఎప్పటి నుంచో సాగుతున్న వ్యవహారమే అని బోర్డు ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి చెబుతుంటే...రాజకీయ పార్టీలు మాత్రం అమ్మటానికి వీల్లేదని వాదిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఏదో ఒక ట్వీట్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్న జనసేన నేత, సినీ నటుడు నాగాబాబు ఈ అంశంపై కూడా ట్వీట్ చేశారు. ‘ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా,ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి.’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Next Story