Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ దృష్టి అంతా ఆ రెండింటిపైనే

టీడీపీ దృష్టి అంతా ఆ రెండింటిపైనే
X

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దృష్టి అంతా రాజధాని అమరావతి నుంచి పోకుండా చూసుకుని ఎలా లాభపడాలా అని చూడటం..లేదంటే ప్రతి అంశంపై రాజకీయం చేయటమే అని మండిపడ్డారు. టీడీపీ నిర్వహించేది మహానాడు కాదు..జూమ్ నాడు అని ఎద్దేవా చేశారు. రైతులకు ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పటానికి అసలు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలు సిగ్గుందా అని కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు.

గత ఏడాది కాలంలో రైతుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత మొత్తం వేసిందో తెలుసా? అని ప్రశ్నించారు. రైతులకు తాము చేసిన ప్రయోజనాల అంశంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రైతులకు 10,209 కోట్ల సాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని తెలిపారు. మూడు వేల కోట్ల రూపాయలతో మార్కెట్ జోక్య నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాదన్నారు. కావాలంటే తెలుగుదేశం నేతలు రైతు భరోసా కేంద్రాలు సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలని కన్నబాబు సూచించారు.

Next Story
Share it