Telugu Gateway
Telangana

అటు వాళ్ళు ఇటు రావొద్దు..ఇటు వాళ్ళు అటు వద్దు

అటు వాళ్ళు ఇటు రావొద్దు..ఇటు వాళ్ళు అటు వద్దు
X

‘హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా చూడాలి. బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా చేయాలి. నియంత్రణ చర్యలు పకడ్బందీగా ఉండాలి. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి. మొత్తం హైదరాబాద్ ను చుట్టుముట్టాలి. వైరస్ ను తుదముట్టించాలి ” అని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన బుదవారం నాడు కరోనా అంశంపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. “హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి.

అధికారులు హైదరాబాద్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరు పాజిటివ్ గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారం టైన్ చేయాలి. “పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు” అని ముఖ్యమంత్రి తెలిపారు.

Next Story
Share it