కాజల్ ఓకే చేశారు..అవి నిజం కాదు
BY Telugu Gateway3 May 2020 1:37 PM GMT
X
Telugu Gateway3 May 2020 1:37 PM GMT
మెగా స్టార్ చిరంజీవికి త్రిష ఈ మధ్య ఓ ఝలక్ ఇచ్చింది. ‘ఆచార్య’ సినిమాకు అంగీకరించి మధ్యలో తప్పుకుంది. ఇందుకు ఏవేవో కారణాలు చెప్పింది. ఆ తర్వాత కాజల్ ఎంట్రీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా కాజల్ కూడా పక్కకు తప్పుకుందని సోషల్ మీడియాలో రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ అంశంపై కాజల్ తరపున ఆమె ప్రతినిధులు స్పందించారు.
ఇవన్నీ పుకార్లు మాత్రమే అని..చిరు ఆచార్యలో నటించటానికి కాజల్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారని..షూటింగ్ ఎప్పుడు మొదలైతే కాజల్ అప్పుడు వస్తారని క్లారిటీ ఇచ్చారు. గతంలో చిరంజీవి, కాజల్ లు ‘ఖైదీ నెంబర్ 150’లో కలసి సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో జోడీ మరోసారి క్లిక్ అవుతుందనేది చిరు అభిమానుల ఆశ.
Next Story