Telugu Gateway
Andhra Pradesh

కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు...నేతలకు నోటీసులు

కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు...నేతలకు నోటీసులు
X

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఏపీ హైకోర్టుతోపాటు కొంత మంది న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ కోర్టులకు ఉద్దేశాలు ఆపాదించేలా మాట్లాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిగిలిన వారు సోషలో మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ అయ్యాయి.

సోషల్‌ మీడియాలోనూ, మీడియాలోనూ కోర్టు తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యల్ని పరిశీలించిన న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేస్తూ ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించటాన్ని ఆక్షేపిస్తూ చాలా మంది పోస్టులు పెట్టారు. ఇదే వివాదానికి కారణమైంది.

Next Story
Share it