అంజలి చెప్పిన ఫోటో కథ
![అంజలి చెప్పిన ఫోటో కథ అంజలి చెప్పిన ఫోటో కథ](http://telugugatewaysite.vocalwire.com/wp-content/uploads/2020/05/Anjali2-e1588506468420.jpg)
అంజలి. వెండితెరపై కన్పించి చాలా రోజులే అయింది. లాక్ డౌన్ దెబ్బకు విడుదల కావాల్సిన సినిమా ‘నిశ్శబ్దం’ కూడా వాయిదా పడింది. ఇక కొత్త సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని అనిశ్చితి. ఈ తరుణంలో హీరోయిన్ అంజలి ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అదే తమ షూటింగ్ చివరి రోజు పోటో అని పేర్కొంది. అందులో అనుష్కతోపాటు అంజలి, సుబ్బరాజు ఉన్నారు. అంతే కాదు..పోలీసు అధికారుల టీమ్ కూడా ఉంది. ఈ సినిమాలో అంజలి శక్తివంతమైన పోలీసాఫీసర్ పాత్రలో కన్పించబతోంది.
‘నిశ్శబ్దం’ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. తొలిసారి అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాను తెరకెక్కించారు.