Telugu Gateway
Cinema

బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి సినిమా రంగానికి సంబంధించి అయితే ..మరొకటి రాజకీయాలకు సంబంధించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఐదేళ్ళ వరకూ ఆగాల్సిన అవసరం లేదని..ఈ లోపే వస్తుందని ప్రకటించారు. మహానాడులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ వారసులు తాము కాదని..కార్యకర్తలే ఆయన అసలైన వారసులు అని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడే ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

గురువారం ఉదయం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నేతకు నివాళి అర్పిస్తూ సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. తెలంగాణా సీఎం కెసీఆర్ తో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు భేటీ అయిన విషయం తనకు తెలియదని..ఈ విషయం తాను పత్రికల్లోనే చూశానని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోందన్నారు. షూటింగ్‌లు త్వరలో ప్రారంభమైతే మంచిదన్నారు. తక్కువ మంది సిబ్బందితో, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్‌లు జరుపుకోవాల్సి ఉంటుందన్నారు.

Next Story
Share it