Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మరో 33 కరోనా కేసులు

ఏపీలో మరో 33 కరోనా కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 33 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2051కు పెరిగింది. అందులో ఇప్పటికే 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 949 మంది. గత 24 గంటల్లో కొత్తగా చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 1, కృష్ణాలో 4,కర్నూలులో 9, నెల్లూరులో 9 కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరిలో గుర్తించిన కేసులు అన్నీ తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవే అని ఏపీ సర్కారు హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏకంగా 10730 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 33 కేసులు పాజిటివ్ గా తేలాయి.

Next Story
Share it