ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..మేలో పూర్తి వేతనాలు
BY Telugu Gateway21 May 2020 5:07 PM IST

X
Telugu Gateway21 May 2020 5:07 PM IST
కరోనా ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం జీతాలే ఇఛ్చారు. పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి తప్పించి..అన్ని శాఖల వాళ్ళకు సగం సగం జీతాలే అందాయి. తొలుత ఈ మోడల్ ను తెలంగాణ సర్కారు ఎంచుకుంది. తర్వాత ఏపీ కూడా ఇదే బాట పట్టింది. ఎందుకంటే కరోనా దెబ్బకు సర్కారుకు వచ్చే ఆదాయం కూడా దారుణంగా పడిపోవటంతో జీతాల్లో కోతలు పెట్టారు.
అయితే ఏపీ సర్కారు తాజాగా మే నెలకు పూర్తి జీతాలు ఇవ్వటానికి రెడీ అయిపోయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే కట్ చేసిన మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన సగం జీతాలను ఎప్పుడు ఇవ్వాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరి తెలంగాణ సర్కారు ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story