ఏపీలో కొత్తగా 48 కేసులు
BY Telugu Gateway13 May 2020 11:50 AM IST

X
Telugu Gateway13 May 2020 11:50 AM IST
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2137కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల్లో 1142 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 47 మంది మరణించగా, ప్రస్తుతం 948 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణాలో 3, కర్నూలులో 7 కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఏపీకి చెందిన వారు 40 మంది అయితే..ఇతర ప్రాంతాలకు చెందిన వారు 8 మంది ఉన్నారని హెల్త్ బులెటిన్ లో తెలిపారు. 24 గంటల్లో 9284 శాంపిళ్లను పరీక్షించగా 48 కేసులు వెలుగుచూశాయి.
Next Story