Telugu Gateway
Politics

మరోసారి ఘనంగా టీఆర్ఎస్ ఇరవై ఏళ్ళ ఉత్సవాలు

మరోసారి ఘనంగా టీఆర్ఎస్ ఇరవై ఏళ్ళ ఉత్సవాలు
X

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా సమస్య అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ తరుణంలో పార్టీ ఇరవై ఏళ్ళ వేడుకలను నిరాడంబరంగా జరపాలని అధిష్టానం నిర్ణయించింది. మరోసారి ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుందామని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 27తో టీఆర్ఎస్ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకోనుండి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కెసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు అన్ని రంగాల్లో గొప్ప విజయాలను పార్టీ సాధించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందని తెలిపారు.

ప్రజలు దశాబ్ధాల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్‌ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కోరారు. ఆదివారం ఆయన స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు నిర్వహించాలని కోరారు. ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారికి ఆదుకోవాలని సూచించారు.

Next Story
Share it