తెలంగాణ కరోనా కేసులు@928
BY Telugu Gateway21 April 2020 8:07 PM IST

X
Telugu Gateway21 April 2020 8:07 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యికి చేరువగా వస్తున్నాయి. మంగళవారం నాడు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 928కి పెరిగాయి. మంగళవారం నాడు ఎనిమిది మంది కరోనా పేషంట్లు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 194కు చేరింది. మరణాలు 23గా నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా వచ్చిన 56 కేసుల్లో సూర్యాపేటలోనే 26 కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 19, నిజామాబాద్ లో 3, గద్వాల్ లో 2, ఖమ్మం, మేడ్చల్,వరంగల్ లో ఒక్కొక్క కేసు, ఆదిలాబాద్ లో రెండు, రంగారెడ్డిలో ఒక కేసు నమోదు అయ్యాయి.ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 711 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story