Telugu Gateway
Telangana

తెలంగాణలో కొత్తగా 13 కరోనా కేేసులు

తెలంగాణలో కొత్తగా 13 కరోనా కేేసులు
X

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కుటుంబాల్లో 268 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని తెలిపారు. రోజుకు 50మందికిపైగా డిశ్చార్జ్‌ చేసే అవకాశముందని చెప్పారు. కరోనా బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 983కి చేరాయన్నారు. కరోనాతో ఇప్పటివరకు 25మంది మృతి చెందారని, 291మంది డిశ్చార్జ్‌ చేశామని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం 663 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపారు. ‘‘గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాం. కరోనా బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. హైదరాబాద్, గద్వాల, సూర్యాపేట, వికారాబాద్‌లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. వైద్యులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు. 10లక్షల పీపీఈ కిట్లు, 10లక్షల ఎన్‌95 మాస్కుల కోసం ఆర్డరిచ్చాం. ఫ్లాస్మా థెరపీ కోసం దరఖాస్తు చేస్తే అనుమతి వచ్చింది’’ అని ఈటల రాజేందర్ తెలిపారు.

Next Story
Share it