తెలంగాణలో 766కు చేరిన కరోనా కేసులు
BY Telugu Gateway17 April 2020 9:00 PM IST
X
Telugu Gateway17 April 2020 9:00 PM IST
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. ఒక్క శుక్రవారం నాడే కొత్తగా 66 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 766కు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 562 ఉన్నాయి. ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారు 186 మంది ఉంటే..కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 18కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 286 కేసులు ఉన్నాయి. ఇక్కడే 131 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 209 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.
Next Story