Telugu Gateway
Andhra Pradesh

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త
X

ఏపీలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ విమర్శల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటే... కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దాం. ఇప్పటివరకు అయింది చాలు. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుంది.’ అని ఓ ప్రటకనలో హెచ్చరించారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ప్రజలు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని పవన్ పేర్కొన్నారు.

ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారు. బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it