Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు
X

దేశంలోని కరోనా వెలుగు చూసిన తొలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ కేసులతో ఉంది. కానీ ఇఫ్పుడు మాత్రం కేసులు రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఇఫ్పటి వరకూ ఒకే రోజు వెలుగు చూసిన కేసుల సంఖ్య 75 మాత్రమే రికార్డు కాగా...ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన కేసుల మొత్తం సంఖ్య 893కు పెరిగింది.

గత 24 గంటల్లో ఒక్క కర్నూలులోనే అత్యధికంగా 31 కేసులు రాగా, గుంటూరులో 18, చిత్తూరులో 14, అనంతపురంలో 6, కృష్ణాలో 2, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 కేసు నమోదు అయింది. కరోనా నుంచి కోలుకుని ఇఫ్పటికే 141 మంది డిశ్చార్జి కాగా..యాక్టివ్ కేసులు 725గా ఉన్నాయి. ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 27 మంది. గత 24 గంటల్లో ఏపీ 6522 పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 234 కేసులు ఉంటే..ఆ తర్వాత స్థానంలో గుంటూరు 195 కేసులతో రెండవ స్థానంలో ఉంది.

Next Story
Share it