Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు..87కు చేరిన సంఖ్య

ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు..87కు చేరిన సంఖ్య
X

ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ కేసుల సంఖ్యతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు. రాష్ట్ర నోడల్ అధికారి విడుదల చేసిన దాని ప్రకారం బుధవారం నాడే కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 87కు చేరింది. బుధవారం నాడు కడప జిల్లాలో ఏకంగా 15 కేసులు రాగా, పశ్చిమ గోదావరి జిల్లలో ఏకంగా 13 కేసులు వెలుగుచూశాయి.

ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో ఐదు, తూర్పుగోదావరిలో రెండు, కృష్ణాలో ఒకటి, నెల్లూరులో 2, ప్రకాశంలో నాలుగు, విశాఖపట్నంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. మార్చి 31 రాత్రి నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ 43 కేసులు వచ్చాయి. ఇంకా పరీక్షలు కొనసాగుతున్నందున కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it