Telugu Gateway
Andhra Pradesh

షాప్స్ తెరవొచ్చు...మాల్స్ కు నో

షాప్స్ తెరవొచ్చు...మాల్స్ కు నో
X

నెల రోజుల లాక్ డౌన్ తర్వాత కేంద్రం ఒక దాని తర్వాత ఒక రంగానికి మినహాయింపులు ఇస్తూ పోతోంది. కొత్తగా అత్యవసరం కాని షాప్ లు కూడా తెరవొచ్చని కేంద్రం పేర్కొంది. అయితే 50 శాతం సిబ్బంది తోనే పనిచేయాలని..అదే సమయంలో విధిగా మాస్క్ లు..గ్లోవ్స్ ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీంతోపాటు సామాజిక దూరం కూడా విధిగా పాటించాలని అన్నారు. విడిగా ఉండే షాప్ లకే ఇది వర్తిస్తుంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం కింద నమోదు అయిన వాటికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే నివాస సముదాయాలు, ప్రాంతాల్లోని దుకాణాలు తెరవొచ్చని స్పష్టం చేశారు. సింగిల్ బ్రాండ్ లేదా వివిధ రకాల బ్రాండ్స్ ఉత్పత్తుల అమ్మే మాల్స్ తోపాటు వాణిజ్య సముదాయాల్లో ఉంటే షాప్ లను మాత్రం అనుమతించరు. ఇప్పటి వరకు కిరాణా దుకాణాలు, నిత్యవసర, అత్యవసర, మందుల, ఫార్మసీలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ, బ్యూటీ సెలూన్స్‌, డ్రైక్లీనర్స్‌, ఎలక్టికల్‌ స్టోర్స్‌ తెరుచుకోవ​చ్చు. అయితే ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ మార్గదర్శకాలు అమలు అవటం కష్టమే. ఎందుకంటే సీఎం కెసీఆర్ మే 7 వరకూ రాష్ట్రంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.

Next Story
Share it