రిషీకపూర్ మృతి
బాలీవుడ్ ను వరస విషాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం నాడే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త సినీ అభిమానులు, బాలీవుడ్ ను షాక్ కు గురిచేయగా..గురువారం ఉదయమే మరో దుర్వార్త. ప్రముఖ నటుడు రిషీకుమార్ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. గత కొంత కాలంగా రిషీకపూర్ అనారోగ్యంతో ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్ను కుటుంబ సభ్యులు ఇటీవలే ముంబయ్ లోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు.
ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. 1952, సెప్టెంబర్ 4న ముంబయ్ లో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.