లాక్ డౌన్ సమయంలో కూల్చివేతలా?
BY Telugu Gateway2 April 2020 5:24 PM IST

X
Telugu Gateway2 April 2020 5:24 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కారు తీరును తప్పుపట్టారు. ఓ వైపు అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే..కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కొండపోచమ్మ ప్రాంతంలో బహిలింపుర్, మామిడ్యాల, తనేదార్పల్లి గ్రామాల్లో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శించారు. ఉన్నపళంగా ఇండ్లను కూల్చి రైతుల బతుకులు బజారుపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై ఇంత కక్ష సాధింపా? అని రేవంత్ విమర్శించారు.
Next Story