తెలంగాణకు రిలయన్స్ విరాళం ఐదు కోట్లు
BY Telugu Gateway10 April 2020 1:23 PM GMT
X
Telugu Gateway10 April 2020 1:23 PM GMT
కరోనాపై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నిధులు సమకూర్చాయి. రిలయన్స్ ప్రతినిధులు శుక్రవారం నాడు తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ కు ఐదు కోట్ల రూపాయల చెక్కను అందజేశారు. కరోనాపై పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పీఎం కేర్స్ కు ఐదు వందల కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story