చిల్లర రాజకీయాలొద్దు...సోనియాపై బిజెపి ఫైర్
BY Telugu Gateway23 April 2020 3:26 PM GMT
X
Telugu Gateway23 April 2020 3:26 PM GMT
కరోనా పోరు విషయంలో ఇంత కాలం కలసి కట్టుగా ఉన్నట్లు కన్పించిన అధికార బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అయ్యాయి. ఇటీవల వరకూ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ విమర్శల జోలికి పెద్దగా పోకుండా పలు సలహాలు, సూచనలకే పరిమితం అయింది.
తొలిసారి సోనియా సీడబ్ల్యూసీలో అందరూ కరోనాపై పోరాడుతుంటే బిజెపి మాత్రం సామాజిక సామరస్యానికి తీరని నష్టం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై బిజెపి మండిపడింది. సోనియా గాంధీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎక్కడా మత విభేదాలు సృష్టించలేదని స్పష్టం చేశారు. దిగజారి రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు.
Next Story