కరోనాతో ఏపీలో ఒకరు మృతి
BY Telugu Gateway7 April 2020 6:14 AM GMT
X
Telugu Gateway7 April 2020 6:14 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా కర్నూలు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఒక్కటే కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటం సానుకూల సంకేతంగా ఉంది. ఈ కేసుతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 304కు పెరిగింది.
ఇప్పటి వరకూ ఏపీలోమొత్తం ఆరుగురు పేషెంట్లు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో ఒక్క కర్నూలు జిల్లాలోనే 74 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రం ఒక్క కేసు కూడా లేకుండా నిలిచాయి. కొత్తగా నమోదు అయిన ఒక కేసు గుంటూరు లోనిది.
Next Story