Telugu Gateway
Telangana

తెలంగాణలో కొత్తగా 43 కేసులు

తెలంగాణలో కొత్తగా 43 కేసులు
X

తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 272కు పెరిగింది. ఒక్క శనివారం నాడే కొత్తగా 43 కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నాడు ఏకంగా 75 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇందులో మెజారిటీ కేసులు ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివే. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారిలో ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నేలేదని..అందరికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ ఛానల్ లో మాట్లాడుతూ తెలిపారు.

Next Story
Share it