Telugu Gateway
Andhra Pradesh

ఆదాయం తగ్గింది...ఆదుకోండి: ప్రధానిని కోరిన జగన్

ఆదాయం తగ్గింది...ఆదుకోండి: ప్రధానిని కోరిన జగన్
X

కరోనాను వైరస్ ను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న, లాక్ డౌన్ అమలు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మోడీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. సీఎం జగన్ ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధానికి వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వారికి తెలిపారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడానికి గల కారణాలను సీఎం జగన్ వివరించారు. ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 111 కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయినవారేనని వీడియో కాన్ఫరెన్స్‌ సీఎం తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల వారిగా సర్వే చేపడుతున్నట్లు, అనుమానితులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి వైద్య సదుపాయం అందిస్తున్నట్లు ప్రధానికి వివరించారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేయాలని సీఎం జగన్‌ కోరారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు సరైన సంఖ్యలో వైద్య పరికరాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it