Telugu Gateway
Andhra Pradesh

ఏపీ కొత్త కేసులు 81..కృష్ణాలోనే 52

ఏపీ కొత్త కేసులు 81..కృష్ణాలోనే 52
X

ఒక్కోసారి ఒక్కో జిల్లా. కరోనా కేసుల విషయంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగ్గా..ఇఫ్పుడు కృష్ణా జిల్లాలో ఒకేరోజు 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏపీ మొత్తంలో కొత్తగా 81 కేసులు రాగా..రాష్ట్రంలో మొత్తం సంఖ్య 1097కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 231 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 835గా ఉంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురంలో రెండు, తూర్పు గోదావరిలో రెండు, గుంటూరులో మూడు, కడపలో మూడు, కర్నూలులో నాలుగు, ప్రకాశంలో మూడు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 279 కేసులు ఉంటే..214 కేసులతో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. కృష్ణాలో కేసుల సంఖ్య 177కు పెరిగింది. గత 24 గంటల్లో ఏపీలో మొత్తం 6768 పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

Next Story
Share it