కరోనాతో కలసి ముందుకు సాగాల్సిందే

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం అంతా కరోనాపైనే సాగింది. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘రాష్ట్రంలో 80 శాతం ప్రాంతం గ్రీన్ జోన్ లోనే ఉంది. ప్రజలు వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవాలి. కరోనాపై ప్రజలు అనవసర భయాలకు దూరంగా ఉండాలి. గ్రీన్ జోన్ లో 559 మండలాలు ఉన్నాయి. రెడ్ జోన్ లో 63, ఆరెంజ్ జోన్ లో 54 మండలాలు ఉన్నాయి. ప్రతి ఆస్పత్రిలో ఎన్ 95 మాస్క్ లు ఉన్నాయి. ఎంత చేసినా వైరస్ ను పూర్తిగా కట్టడి చేయలేం. కరోనా ఎవరికి ఉందో లేదో తెలుసుకోవటం కష్టం. నాతో సహా ఎవరికైనా కరోనా రావొచ్చు. కరోనా సోకితే అంటరానివాడిలా చూడాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే. రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలసి జీవించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడుసార్లు సర్వే చేశాం. వాలంటీర్లు, ఆశా వర్కర్లకు హ్యాట్సాఫ్. అన్ని కష్టాలు ఉన్నా పెంచిన పెన్షన్లు ఇస్తున్నాం.
ప్రజలు వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోవాలి. గతంలో ఇలాంటి విపత్తులు వస్తే పరీక్షించే సౌకర్యాలు కూడా లేవు. గత నెల రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేశాం. ఏపీలో 9 వైరాలజీ ల్యాబ్ ల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 5 కోవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ఈ నెలలోనే టెస్టింగ్ సామర్ధ్యం పెంచబోతున్నాం. కరోనా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఇఫ్పటికిప్పుడు లేదు. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. కరోనా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. కరోనాతో చనిపోయిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణం అవుతున్నాయి. 70 శాతం టెస్ట్ లు అన్నీ నెగిటివ్ వస్తున్నాయి. లాక్ డౌన్ నకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. కరోనా పూర్తిగా నయమయ్యే జ్వరం లాంటిదే. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ఇంట్లోనే నయం అవుతుంది.’ అని వ్యాఖ్యానించారు.