తెలంగాణలో కొత్తగా 27 కేసులు...మొత్తం 154
BY Telugu Gateway2 April 2020 4:01 PM GMT
X
Telugu Gateway2 April 2020 4:01 PM GMT
తెలంగాణలో ఒక్క గురువారం నాడే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కి పెరిగింది. కొత్త కేసులు అన్నీ ఢిల్లీతో సంబంధం ఉన్న కేసులుగానే అధికారులు చెబుతున్నారు. గురువారం నాడు ముగ్గురు కరోనా పేషేంట్లను డిశ్చార్జి చేశారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17కి చేరింది. తెలంగాణలో మొత్తం కరోనా డెత్ లు 9గా నమోదు అయ్యాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారు 128 మంది.
Next Story