Telugu Gateway
Politics

ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలొద్దు

ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలొద్దు
X

లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టొద్దని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల సడలింపుల విషయంలో పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న సమాచారం రావటంతో కేంద్రం అప్రమత్తం అయింది. కేరళ సర్కారు అత్యవసరం కాని హోటళ్లు, బస్ సర్వీసులకు అనుమతి ఇవ్వటంపై కేంద్ర హోం శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ సీఎస్ కు లేఖ రాశారు. ఈ నిర్ణయాలను తక్షణం సమీక్షించాలని పేర్కొన్నారు. కేరళతోపాటు పలు రాష్ట్రాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి వెంటనే చర్యలకు ఆదేశించారు. ప్రతి రాష్ట్రం విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.

Next Story
Share it