Telugu Gateway
Andhra Pradesh

గుజరాత్ టూ ఏపీ వయా సముద్రమార్గం

గుజరాత్ టూ ఏపీ వయా సముద్రమార్గం
X

లాక్ డౌన్ చాలా మందిని కష్టాల పాలు చేసింది. ఇందులో వలస కూలీల నుంచి మొదలుకుని మత్సకారులు..రకరకాల పనులపై బయటకు వెళ్లిన వారు ఉన్నారు. లాక్ డౌన్ ఇప్పుడు చాలా మందికి కనీసం తిండి కూడా లేకుండా చేస్తోంది. ఏపీకి చెందిన ఐదు వేల మంది మత్సకారులు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వీరి అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓసారి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడి వారికి తిండి, వసతి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు.

ఇప్పుడు మరోసారి చర్చించి గుజరాత్ నుంచి సముద్ర మార్గం ద్వారా వారిని ఏపీకి రప్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీరి అంశంపై స్పందించారు. తాజా పరిణామాలతో వారు ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమం అయినట్లే కన్పిస్తోంది. ఈ అంశంపై గురువారం నాడు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందిస్తూ ప్రత్యేక బోట్లలో గుజరాత్ లో చిక్కుకుపోయిన 5000 మందిని వెనక్కి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it