Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 1332కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 1332కు చేరిన కరోనా కేసులు
X

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వేగంగా ఏ మాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1332కు పెరిగాయి. గుంటూరులోనే కొత్తగా 29 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1014 యాక్టివ్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ఇఫ్పటికే 287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది మరణించారు.

కొత్తగా కృష్ణాలో 13, కర్నూలులో 11, ప్రకాశంలో 4,శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో ఒక్కోటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలో 343 ఉండగా, గుంటూరులో 283, కృష్ణాలో 236 కేసులు ఉన్నాయి.గత 2 గంటల్లో 7727 శాంపిళ్ళను పరీక్షించగా అందులో 73 పాజిటివ్ కేసులు వచ్చాయి.

Next Story
Share it