తెలంగాణలో కొత్తగా రెండు కరోనా కేసులు
BY Telugu Gateway25 March 2020 4:34 PM GMT
X
Telugu Gateway25 March 2020 4:34 PM GMT
తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో 43 సంవత్సరాల మహిళకు కరోనా వైరస్ సోకింది. ఓ పేషంట్ (పీ34) ప్రైమరీ కాంటాక్ట్ కావటంతో ఆమె వైరస్ బారినపడ్డారు. ఎలాంటి విదేశీ ప్రయాణం చేయకపోయి పేషెంట్ ద్వారా నే ఆమెకు ఈ వైరస్ సోకింది.
సౌదీ అరేబియా నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కూడా కరోనా పాజిటివ్ గా తేల్చారు. అయితే ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉంది. ఆస్పత్రిలో చేర్పించి..ఇద్దరికీ వైద్యం అందిస్తున్నారు. కొత్తగా వెలుగు చూసిన రెండు కేసులతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి పెరిగింది.
Next Story