Telugu Gateway
Telangana

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా
X

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నానికి కొత్తగా మూడు పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉండటం విశేషం. దోమల్ గూడలో నివసించే భార్యా, భర్తలు ఇద్దరూ డాక్టర్లే. వారు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. వారిద్దరిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. కుత్భుల్లాపూర్ కు చెందిన 49 సంవత్సరాల వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.

ఢిల్లీ ప్రయాణించిన ఆయనకు కాంటాక్ట్ రూపంలో కరోనా వచ్చినట్లు గుర్తించారు. అతని పరిస్థితి కూడా నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా వెలుగు చూసిన మూడు కేసులతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. అయితే ఇందులో ఒక వ్యక్తి ఇప్పటికే రివకరి అయి డిశ్చార్జ్ కూడా అయ్యాడు.

Next Story
Share it