చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ల వినియోగించిన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ ఎంపీ రేవంత రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. గురువారం సాయంత్రం నార్సింగి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి..మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా..పధ్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ కెమెరా వాడిన కేసులో పోలీసులు రేవంత్పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి సెక్షన్ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, రెడ్క్రాఫ్ట్ యాక్ట్ కింద రేవంత్రెడ్డితోసహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్ ఎగరవేసినట్టు పోలీసులు తేల్చారు. రేవంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి.