Telugu Gateway
Cinema

రామ్ చరణ్ 70 లక్షల విరాళం

రామ్ చరణ్ 70 లక్షల విరాళం
X

ప్రముఖ హీరో రామ్ చరణ్ కరోనాపై పోరుకు 70 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ తో స్పూర్తి పొంది తాను ఈ మొత్తం విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. 70 లక్షల రూపాయలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతోపాటు ప్రధాని సహాయ నిధికి కూడా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఎక్కడ ఎంత ఇవ్వనున్నారనే అంశంపై మాత్రం రామ్ చరణ్ తన నోట్ లో క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవటానికి తన వంతు సాయంగా ఈ మొత్తం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు తెలుగు రాష్టాలైన ముఖ్యమంత్రులైన కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కరోనా నియంత్రణకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. బాధ్యత గల పౌరుడిగా అందరూ ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించేందుకు ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు.

Next Story
Share it