క్యాట్ లో ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) లో చుక్కెదురు అయింది. తన సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. అయితే సస్పెన్షన్ ఆదేశాలు కొట్టేయాలంటూ ఏబీ పిటీషన్ ను క్యాట్ తోసిపుచ్చింది. సస్పెన్షన్ పై కేంద్రాన్ని సంప్రదించి..అవసరం అయితే అప్పుడు క్యాట్ ను ఆశ్రయించవచ్చని పేర్కొంది. దీంతో ఏబీకి చిక్కులు తప్పేలా లేవు. భద్రతా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రభుత్వం ఆయనపై అభియోగాలు మోపింది.
అదే సమయంలో సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సస్పెన్షన్ చేసినట్లు సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం కూడా ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. అంతే కాదు త్వరగా విచారణను పూర్తి చేయాలని కోరింది. చంద్రబాబు హయాంలో ఆయన అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.