ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించారు. తమ తరపున వర్ల రామయ్యను బరిలో నిలుపుతున్నామని తెలిపారు. సంఖ్యాబలంపరంగా చూస్తే టీడీపీకి సీటు వచ్చే ఛాన్స్ లేదు. ఏపీకి రానున్న నాలుగు సీట్లను అధికార వైసీపీనే దక్కించుకోనుంది. అయితే ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరక్కుండా కేవలం ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతోనే టీడీపీ అభ్యర్ధిని బరిలో నిలుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. టీడీపీ బరిలో లేకపోతే ఏకగ్రీవంగా రాజ్యసభ ఎన్నికలు పూర్తవుతాయి.
ఇప్పుడు టీడీపీ అభ్యర్ధిని పెడుతుండటంతో ఎన్నిక అనివార్యం కానుంది. ఇది ఊహించని ట్విస్ట్ గా మారింది. గెలుస్తామని కాదని..ప్రభుత్వ ఆగడాలను చెప్పటానికే తాము బరిలో నిలుస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేస్తామని..ఎవరైనా ఉల్లంఘిస్తే వారి సభ్యత్వం పోతుందని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా ప్రభుత్వ ఆగడాలు ఎలా చెబుతారన్నదే ఇప్పుడు ప్రశ్న