హెరిటేజ్ ఫుడ్స్ కోటి విరాళం
BY Telugu Gateway29 March 2020 5:16 AM GMT
X
Telugu Gateway29 March 2020 5:16 AM GMT
కరోనాపై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐదు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చెరో 30 లక్షల రూపాయల లెక్కన, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రల సీఎంల నిధికి పది లక్షల రూపాయల లెక్కన ఇవ్వనున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఫ్యామిలీ తరపున ఏపీ సీఎం సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story