తెలంగాణ బడ్జెట్ 1,82914 కోట్లు
ఆర్ధిక మంత్రి హరీష్ రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆయన సభ ముందు 1,82,914.42 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. తమ సర్కారు ప్రాధాన్యతలు ఏమిటో హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. అత్యంత కీలకమైన రైతులకు సంబంధించిన స్కీమ్ లకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించినట్లు స్పష్టం అవుతోంది. అయితే రుణ మాఫీని మాత్రం విడతల వారీగా చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ సందర్భంగా హరీష్ రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది.
బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్ 1,82,914.42 కోట్లుగా హరీష్రావు పేర్కొన్నారు. అదేవిధంగా రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లుగా మంత్రి వెల్లడించారు. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
హరీష్రావు ప్రసంగం హైలైట్స్:
గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది
కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు
2019-20 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది
గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు
2018-19లో 14.3% ఉన్న జీఎస్డీపీ 19-20కి 12.6% తగ్గింది
తెలంగాణ ఆర్థిక బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు
రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు
క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు
ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు
సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు
రూ.25వేలు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ
ఈనెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తాం
రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు 4 విడతలుగా పంపిణీ
చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తారు
ఎంత ఖర్చైనా సరే కందులను కొనుగోలు చేస్తాం
రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయింపు
మూసీ రివర్ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు
మున్సిపల్శాఖకు 14,809 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు
పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు
ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు
హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు
వైద్య రంగానికి రూ.6,156 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.23,005 కోట్లు
కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు
గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు
మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు
ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు
ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు
సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు
రవాణా, రోడ్లుభవనాలశాఖకు రూ.3494 కోట్లు
పోలీస్శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు
విద్యుత్శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు
అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు
పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు
ఎస్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు
మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు
పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు
మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు
పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు
ఈ ఏడాది నుంచి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం - శంషాబాద్