Telugu Gateway
Telangana

తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్

తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేవలం ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ సూచన చేసినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం రాష్ట్రమంతటా లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలు తప్ప..మిగతా అంతా బంద్ అని ప్రకటించారు. మనల్ని మనం కాపాడుకోవటం తప్ప..ఇది ఎవరి కోసమే చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉంటే..భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.. దీనికి తెలంగాణ ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణలో కొత్తగా మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని..దీంతో మొత్తం కేసులు 26కి చేరాయన్నారు. ఇందులో అందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన చరిత్ర ఉన్నవారేనని తెలిపారు. ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ‘ఆదివారం రాత్రి నుంచి అన్ని అంతర్జాతీయ విమానాలు బంద్ అయిపోతున్నాయి.అయితే ఇప్పటివరకు ఇతర దేశాల నుండి వచ్చేవారిని అందరిని క్వారంటైన్ లోకి పంపించాం. ఇక్కడ కూడా ఒక్క వ్యక్తికి వచ్చింది కాబట్టి ఇంకా కఠినమైన చర్యలు చేపట్టాలి. ఇవాళ్టి లాగానే ఈనెల 31వ తేదీ వరకు కొనసాగించాలి. అందరూ దీన్ని పాటించాలి దయచేసి. ఏపీడమిక్ డిసిస్ యాక్ట్ అమలు చేస్తున్నాం ,ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం.

మార్చి 31 వ తేదీ వరకు ఎవరు కూడా బయటకు రావద్దు.ఎవరు కూడా గుమికుడొద్దు. ఈ యాక్ట్ ప్రకారం 5 గురు కంటే ఎక్కువ మంది ఒక్కదగ్గర ఉండకూడదు.నిత్యావసర వస్తువుల విషయంలో కుటుంబం లో ఒక్కరికి అనుమతి ఉంటుంది. కూలీలకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంటుంది. నెల రోజులకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డ్ ఉన్న ఒక్క వ్యక్తి 12 కేజీల బియ్యం అందజేస్తాం,దీనికి సంబంధించి సీఎస్ ఉత్తర్వులు కూడా ఇస్తారు. 3లక్షల 36 వేల టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం.1103 కోట్ల రూపాయల వాల్యూ. ప్రతి రేషన్ కార్డ్ కు 15 వందల నగదు ఇస్తాం.ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ డ్యూటీ కి రావాల్సిన పని లేదు.అత్యవసర పరిస్థితి ఉన్న ఉద్యోగులు మాత్రమే డ్యూటీ కి రావాలి. పేపర్ వాల్యువేషన్ చేసేవారికి కూడా రిలీవ్ చేస్తున్నాం. 1897 యాక్ట్ ప్రకారం బిల్డింగ్,ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కూలీలకు ,ప్రభుత్వం,యజమాని చెల్లించాలి. లాక్ డౌన్ కాలంలో ఆయా సంస్థలు ఉద్యోగులకు వారం రోజుల డబ్బులు చెల్లించాలి. అంగన్ వాడి కేంద్రాలు క్లోజ్ చేసి వారికి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

అత్యవసరము కానీ ఆపరేషన్ లు అన్ని క్లోజ్ చేస్తాం. వైద్యులను మనం కాపాడుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మొత్తం క్లోజ్ ఆటో లు,బస్ ఇతర రవాణా మొత్తం బంద్. ఇది మొత్తం కూడా వైరస్ ను తరిమి కొట్టాలి కాబట్టి ఇవ్వన్నీ పాటించాలి. అన్ని రైళ్ళఉ బంద్ చేశాం.ఎవరి ఇండ్లలో వారే ఉండాలి. రాష్ట్ర సరిహద్దు లు క్లోజ్ చేస్తున్నాం,తెలంగాణ కోసం వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తాం. ప్రైవేట్ బస్ లు కూడా బంద్. ప్రతి ఒక్కరికీ దయచేసి ఎవరి ఇండ్లలో వాళ్లే ఉండండి. అంబులెన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. దయచేసి ప్రజలను కోరుతున్న అందరూ సహాకరించాలి. వారం రోజులు ఇండ్లలో ఉంటే ఆ మహమ్మారి మనం తరిమికొట్టవచ్చు. భయంకరంగా చెడగొట్టుకున్నారు ఇటలీ వాళ్ళు .అలాంటి దుస్థితి మనకు రావద్దు అంటే మనకు మనం దూరంగా ఉంటే బెటర్. ఇతర దేశాల నుండి వచ్చిన వారికి మళ్ళీ దయచేసి చెప్తున్నా మీ దగ్గర్లోని అధికారులకు రిపోర్ట్ చేయండి. హోమ్ క్వారన్తటైన్ లో ఉన్నవారు ఇంట్లోనే ఉంచాం.

అందులో నుండి కొంతమంది దుర్మార్గులు బయట తిరుగుతున్నారు.వాళ్ళు మీకు మీరు ఇంట్లో నే ఉండండి. దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా మీకు మీరు సెల్ఫ్ డిస్టన్స్ లో ఉండండి. ప్రభుత్వం ఇంత మంచి వసతులు కల్పిస్తుంటే ఇబ్బంది ఏంటి?.6 వేల పై చిలుకు మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మార్చి 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్ డౌన్. నిన్న మనం పప్రధానమంత్రి తో పాటు మనం కూడా పిలుపునివ్వడం జరిగింది. చాలా గొప్పగా అద్భుతమైనది గా కొనసాగింది, ఎవరు ఇళ్ళ నుండి బయటకు రాకుండా గొప్పగా చేశారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రం అద్భుతంగా చేశారు. మోడీ చెప్పినట్లు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు,నాతోపాటు మా కుటుంబ సభ్యులు ఇతర మంత్రులు, అధికారులు సంఘీభావం తెలియజేశారు. నా తరుపున ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అభినందనలు తెలువుతున్నా’ అని ప్రకటించారు.

Next Story
Share it