Telugu Gateway
Andhra Pradesh

షెడ్యూల్..నోటిఫికేషన్ ఒకే రోజా?

షెడ్యూల్..నోటిఫికేషన్ ఒకే రోజా?
X

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఇంత గందరగోళం ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సూపర్ ఎన్నికల కమిషనర్ లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు కూడా ఇష్టానుసారం ప్రకటించారని విమర్శించారు. ఇంత తొందరగా..గందరగోళంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు శనివారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘స్థానిక ఎన్నికలకు, నిఘా యాప్‌కు ఏమిటి సంబంధం? షెడ్యూల్, నోటిఫికేషన్ అన్నీ ఒకేసారి ఇస్తారా?. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. పార్టీ రంగులపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. కానీ ఏమీ పట్టించుకోవటం లేదు.

బీసీల రిజర్వేషన్లు గణనీయంగా పడిపోయాయి. బీసీలకు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లను ఎందుకు తగ్గించారు. నెల్లూరు జిల్లాలో 10.49 శాతం రిజర్వేషన్లే ఉన్నాయి. తొంభై శాతం స్థానాల్లో వైసీపీనే గెలవాలని మంత్రుల్ని బెదిరిస్తారా?. మాన్సస్ ట్రస్ట్‌ లో మీరెందుకు జోక్యం చేసుకున్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు మేం సిద్ధం, మీ ఆటలు సాగవు . ఏమి చూసి ప్రజలు వైసీపీకి ఓటు వేయాలి? . అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను రోడ్డుపైకి తెచ్చారు. అందర్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు,’ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో రౌడీయిజంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it