Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం నాడు రెండు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరు కాకినాడకు చెందిన వ్యక్తికాగా, మరొకరు రాజమండ్రికి చెందిన వారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ మొత్తం 33 శాంపిల్స్ ను పరీక్షించగా...అందులో 31 శాంపిల్స్ నెగిటివ్ గా..రెండు పాజిటివ్ గా వచ్చాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కాకినాడకు చెందిన కరోనా పేషంట్ వయస్సు 49 సంవత్సరాలు కాగా, రాజమండ్రికి చెందిన వ్యక్తి వయస్సు 72 సంవత్సరాలు.

ఏపీలో ఇప్పటివరకూ ఆరు కేసులతో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండగా..గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగు చొప్పున కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరిలో 3, చిత్తూరులో ఒకటి, కర్నూలు ఒకటి, నెల్లూరు ఒకటి, ప్రకాశంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 23 కేసుల్లో ఇద్దరు ఇఫ్పటికే రికవరి అయ్యారు.

Next Story
Share it