ట్రంప్ తో విందుకు కెసీఆర్ కు ఆహ్వానం
BY Telugu Gateway22 Feb 2020 6:15 AM GMT
X
Telugu Gateway22 Feb 2020 6:15 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇవ్వనున్న విందులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం వచ్చింది. దేశంలోని మొత్తం ఎనిమిది ముఖ్యమంత్రులకే ఆహ్వానం రాగా అందులో కెసీఆర్ ఒకరు. ఈ విందులో పాల్గొనేందుకు ఈనెల 24 వ తేదీ సాయంత్రం లేదా 25 వ తేదీ మధ్యాహ్నం కెసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళతారని సమాచారం.
మొత్తం ఈ విందులో అతి తక్కువగా అంటే 90 నుంచి 95 మంది అతిథులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులకే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వెళ్ళింది. ముఖ్యమంత్రుల విషయానికి వస్తే అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణా ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.
Next Story