ఏపీలో మంత్రి సంతకం ఫోర్జరీ..కేసు నమోదు
BY Telugu Gateway13 Feb 2020 12:12 PM IST

X
Telugu Gateway13 Feb 2020 12:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి ఏకంగా మంత్రి సంతకమే ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తానేటి వనతి పోలీసు కేసు పెట్టారు. అంతే కాదు ఆమె ఈ విషయాన్ని హోం మంత్రి సుచరిత, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకాన్ని పోర్జరీ చేశారని తెలిపారు.
రెడ్డప్ప టీడీపీ నాయకుడు అని చెబుతున్నారు. కడప జిల్లాలో అసైన్డ్ భూమి పొందటం కోసం తన లెటర్ ప్యాడ్ పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సిఫార్స్ లేఖను జిల్లా కలెక్టకు కు పంపించారు.
Next Story