Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబును తరిమికొట్టాలి

చంద్రబాబును తరిమికొట్టాలి
X

వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు తలపెట్టిన మూడు రాజధానులను అడ్డుకుంటున్న చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ప్రజలు చైతన్యవంతులే కాబట్టి లోకేష్‌ని మంగళగిరిలో ఓడించారన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తుంటే..జగన్‌ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.

లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న సోషల్‌ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తే 80 శాతం టీడీపీ నేతలు జైల్లో ఉంటారని రోజా హెచ్చరించారు. జగన్ సర్కార్ రూపొందించిన రాజధాని బిల్లుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లే అని స్పష్టం చేశారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Next Story
Share it