బడ్జెట్ హైలెట్ సుదీర్ఘ స్పీచే..రాహుల్
BY Telugu Gateway1 Feb 2020 12:03 PM GMT
X
Telugu Gateway1 Feb 2020 12:03 PM GMT
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సుదీర్ఘ స్పీచ్ తప్ప..ఏమీ లేవని అన్నారు. దేశంలోని యువత ఉద్యోగావకాశాలు కోరుకుంటోందని..అలాంటి వారికి ఈ బడ్జెట్ లో ఏమీలేదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లకు ఏమి చేయాలో తెలియటం లేదని వ్యాఖ్యానించారు.
ఈ బడ్జెట్లో ఏ విషయంలోనూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేస్తామని చెప్పిన ప్రభుత్వం... రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసిందని మండిపడ్డారు. 2020-21బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
Next Story