Telugu Gateway
Politics

వాళ్లకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ..మనకు స్టాట్యూ ఆఫ్ యూనిటీ

వాళ్లకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ..మనకు స్టాట్యూ ఆఫ్ యూనిటీ
X

‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీలో ఎక్కడలేని జోష్ కన్పించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన మొతెరా స్టేడియంలో అత్యంత అట్టహాసంగా సాగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో తొలుత మాట్లాడిన మోడీ సభికులతో భారత్ మాతా కీ జై....నమస్తే ట్రంప్..నమస్తే ట్రంప్ నినాదాలు చేయించారు. అదే సమయంలో అమెరికా, భారత్ సంబంధాలు సుదీర్ఘకాలం ఇలాగే మంచిగా కొనసాగాలని ఆకాక్షించారు. మొతెరా స్టేడియం జనంతో కిక్కిరిపోయింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను సభకు పరిచయం చేసిన అనంతరం ట్రంప్ తో కలసి చేతులు పైకెత్తి అభివాదం చేశారు. ‘మొతెరా క్రికెట్‌ స్టేడియంలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్‌ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ట్రంప్‌, ఆయన కుటుంబం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

ఇది గుజరాతీ గడ్డ అయినా యావత్తు దేశమంతా దీన్ని స్వాగతిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి ఇదే నిదర్శనం. ట్రంప్‌ ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, అమెరికా యావత్తు భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది. అహ్మదాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ నదికి విశిష్టపాత్ర ఉంది. మనం అనుసరిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం.. భారత్‌ అమెరికాలను కలుపుతుంది. స్టాచ్యు ఆఫ్‌ లిబర్టీ - స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ మధ్య సంబంధముంది. ఇరు దేశాల స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడాలి. ట్రంప్‌ రాక దీనికి కచ్చితంగా దోహదపడుతుది. అభివృద్ధి, సౌభ్రాతృత్వానికి బాటలు వేస్తుంది. ఇవాంక రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చారు. మరోసారి ఇవాంకకు స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నా’అని మోదీ పేర్కొన్నారు.

Next Story
Share it