Telugu Gateway
Politics

ఆత్మీయ మిత్రుడికి కృతజ్ఞతలు..ఇదీ ట్రంప్ మాట

ఆత్మీయ మిత్రుడికి కృతజ్ఞతలు..ఇదీ ట్రంప్  మాట
X

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సోమవారం నాడు గుజరాత్ లోని సబర్మతి అశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్‌ దంపతులకు స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్‌ దంపతులు నివాళులర్పించారు. గాంధీజీ గురించిన విశేషాలను ప్రధాని మోదీ వారికి వివరించారు. చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్పారు. ట్రంప్‌ చరఖాపై కాసేపు నూలు వడికారు.

అనంతరం సందర్శకుల పట్టికలో ట్రంప్‌ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’అని విజిటర్స్‌ బుక్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు. ‘త్రీ మంకీస్‌’ ప్రతిమ ద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోదీ వివరించారు. అనంతరం వారు మోతేరాకు బయల్దేరారు.

Next Story
Share it