Telugu Gateway
Telangana

‘సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష

‘సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసు విషయంలో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. స్కూల్ కు వెళ్ళే పిల్లలను కిడ్నాప్ చేసి.. రేప్ చేయటంతో పాటు తర్వాత దారుణంగా హతమార్చారనే అభియోగంతో శ్రీనివాసరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సాయంత్రం తన తీర్పు వెలువరించింది.

కేసు విచారణలో భాగంగా 101 సాక్షులను విచారించారు. మూడు కేసుల్లోనూ శ్రీనివాసరెడ్డి పాత్రను నిర్ధారించారు. మూడు కేసులకు సంబంధించి కోర్టు విడివిడిగా తీర్పులను వెలువరించింది. రెండు కేసుల్లో మరణశిక్షను విధించిన కోర్టు, మరో కేసులో మాత్రం యావజ్జీవ శిక్ష విధించింది. మూడు కేసుల్లోనూ శ్రీనివాసరెడ్డి నేరం చేశారని కోర్టు తేల్చింది. స్కూల్ వెళ్తున్న అమ్మాయిలను లిఫ్ట్ ఇస్తానని చెప్పి శ్రీనివాసరెడ్డి ఈ దారుణాలకు ఒడిగట్టాడని పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రత్యేక కోర్టు తీర్పుపై హాజీపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జాప్యం చేయకుండా తక్షణమే శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలని గ్రామస్తులు కోరారు.

Next Story
Share it